చిరు, చరణ్‌ మల్టీస్టారర్‌ : ఆ మలయాళ మూవీకి రీమేక్‌

చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెం.150 చిత్రంలోని ఒక పాటలో చరణ్‌ కొన్ని సెకన్ల పాటు కనిపిస్తేనే మెగా ఫ్యాన్స్‌ కేకలు, ఈలలు గోలలు చేశారు.

అలాంటిది ఒక సినిమా మొత్తం ఇద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

అలాంటి ఆసక్తికర విషయం ఇప్పుడు ఒకటి తీసుకు వచ్చాం.సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌లు కలిసి ఒక సినిమాలో చేయాలనుకుంటున్నారు.

ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుంది.మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసీఫర్‌ చిత్రాన్ని తెలుగులో వీరిద్దరు రీమేక్‌ చేయబోతున్నారు.

"""/"/  లూసీఫర్‌ చిత్రంను మోహన్‌లాల్‌ మరియు పృథ్వీరాజ్‌లు చేశారు.మలయాళంలో సెన్షేషనల్‌ హిట్‌ అయ్యింది.

ఆకట్టుకునే కథ మరియు కథనంతో సాగిన ఆ చిత్రం బాలీవుడ్‌లో కూడా రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉంది.

ఆ చిత్రంలో మోహన్‌లాల్‌ పోషించిన పాత్రను చిరంజీవి పోషిస్తే చాలా బాగుంటుంది.కాస్త నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్ర అయినప్పటికి తప్పకుండా చిరంజీవికి ఆ పాత్ర యాప్ట్‌ అవుతుంది.

అలాగే పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను చరణ్‌ చేయవచ్చు.వీరిద్దరు కూడా అద్బుతంగా ఆ పాత్రలకు న్యాయం చేస్తారనే నమ్మకం అందరిలో ఉంది.

"""/"/  ఇటీవలే లూసీఫర్‌ తెలుగు రీమేక్‌ రైట్స్‌ను మెగా ఫ్యామిలీకి చెందిన వారు దక్కించుకున్నారట.

చిరంజీవి సూచన మేరకు మంచి రేటు పెట్టి మరీ ఆయన రీమేక్‌ రైట్స్‌ను కొనుగోలు చేశాడట.

ఒక యువ దర్శకుడికి ఆ రీమేక్‌ రైట్స్‌ను అప్పగించడంతో పాటు లూసీఫర్‌ కథలో చాలామార్పులు చేర్పులు చేయడంతో పాటు కమర్షియల్‌గా మార్చాలని చిరంజీవి సూచించాడట.

రెండు మూడు సంవత్సరాల సమయం తర్వాత అయినా లూసీఫర్‌ చేయాలని చిరంజీవి ఆశ పడుతున్నాడు.

ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత చరణ్‌ రీమేక్‌లో నటిస్తాడేమో చూడాలి.

త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలో కీలక పాత్ర వహించనున్న మలయాళ సూపర్ స్టార్…