వైయస్ జగన్ తో చిరంజీవి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మధ్యాహ్నం భేటీ కానున్నారు.

అంత మాత్రమే కాక ఇద్దరు కలిసి లంచ్ చేయనున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా చిరంజీవి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి వైఎస్ జగన్ ని కలవడానికి ప్రత్యేక విమానంలో బయలుదేరుతున్నారు.

వైయస్ జగన్ తో భేటీ తర్వాత సినిమా టికెట్ల వ్యవహారంపై మాట్లాడతానని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే గతంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఇండస్ట్రీ సమస్యలు విషయానికి సంబంధించి.

వైయస్ జగన్ అపాయింట్మెంట్ చిరంజీవికి.దొరకనట్టు వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ఏకంగా ఇద్దరు కలిసి లంచ్ ప్రోగ్రాం లో పాల్గొంటూ ఉండటం తో.

చిరంజీవి, జగన్ భేటీ అటు పొలిటికల్ గా ఇటూ సినిమా ఇండస్ట్రీ పరంగా.

ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో చిరంజీవి.

వైఎస్ జగన్ భేటీ కావడం తెలిసిందే.చిరంజీవి దంపతులతో వైఎస్ జగన్ దంపతులు ఆ సమయంలో లంచ్ కూడా చేయడం జరిగింది.

తన ఇంటికి వచ్చిన చిరంజీవి ని శాలువాతో సత్కరించి.జగన్ చాలాసేపు మాట్లాడారు.

"""/" / ఇదే తరుణంలో చిరంజీవి కూడా వైఎస్ జగన్ రాజకీయంగా తీసుకున్న చాలా ఆలోచనల పట్ల సోషల్ మీడియాలో స్పందిస్తూ.

పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది.అనంతరం ఇండస్ట్రీ పరంగా వైసీపీ ప్రభుత్వం.

తీసుకున్న కొన్ని నిర్ణయాలు.టిక్కెట్ ధరలను నియంత్రించడం తోపాటు బెనిఫిట్ షోలు లేకుండా చేస్తూ.

ఉండటంతో ఈ విషయంలో చిరంజీవి వ్యతిరేకించడం జరిగింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ జగన్ తో చిరంజీవి భేటీ కావడం.

అనంతరం చిరంజీవి మీడియాతో ఏం మాట్లాడుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా సీఎం రేవంత్ ప్రచారం..!