Chiranjeevi : ఆ జర్నలిస్టు రాసిన తప్పుడు వార్తలకు కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి.. ఏం జరిగిందంటే..?

చాలామంది జర్నలిస్టులు ( Journalist ) వారికి తోచిన వార్తలు రాస్తూ ఉంటారు.

అయితే అందులో కొన్ని నిజాలు ఉంటే మరి కొన్ని అబద్ధాలు ఉంటాయి. """/"/ కానీ కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలు వల్ల ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు.

అయితే అలాంటి వారిలో నేను కూడా ఒకడిని అంటూ తన బాధని బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) పై ఎంతోమంది మీడియా వాళ్ళు ఇప్పటికే ఎన్నో తప్పుడు వార్తలు రాశారు.

మరీ ముఖ్యంగా వారి పర్సనల్ విషయాలను కూడా బయటపెడుతూ ఉంటారు.తమ కూతురు,కొడుకు విషయంలో వచ్చిన వార్తల వల్ల కూడా ఇప్పటికే చిరంజీవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే తాజాగా చిరంజీవి చేతుల మీదగా ఓ సీనియర్ జర్నలిస్ట్( Senior Journalist ) తాను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఇక దీనికోసం ఆ జర్నలిస్టు చిరంజీవి ఇంటికి వెళ్లి చిరంజీవి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు.

ఇక ఈ బుక్ ఆవిష్కరణ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి సినీ రచయితలతో, జర్నలిస్టులతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది.

"""/"/ కలం ద్వారా జర్నలిస్టులకు ఎంతో మంచి గుర్తింపు ఉంటుంది.వారి పవర్ మొత్తం ఆ పెన్నుతో రాసే రాత లోనే ఉంటుంది.

ఇక వీరు ఆ పెన్నుతో రాసేవి కొన్ని నిజాలు అయితే మరికొన్ని అబద్ధాలు అవుతాయి.

కానీ కొంతమంది జర్నలిస్టులు మాత్రం ఎదుటి వాళ్లు బాధపడే విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను.ఇక వాళ్ళు రాసిన తప్పుడు వార్తలు నా జీవితంలో నేను మర్చిపోలేను.

ఆ తప్పుడు వార్తలు నా జీవితంపై ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి.అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.