క్రికెట్ దిగ్గజంతో చిరంజీవి దంపతులు.. మెగా సెల్ఫీ వైరల్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పరిచయం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి మనసున్న వ్యక్తిగా అభిమానుల హృదయాల్లో నిలిచాడు.

ఎన్నో సినిమాలలో నటించిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలిచాడు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇప్పటికీ వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటీగా దూసుకెళ్తున్నాడు.ఇదిలా ఉంటే క్రికెట్ దిగ్గజంతో చిరంజీవి దంపతులు ఓ సెల్ఫీ తీసుకున్నారు.

చిరంజీవికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు.అప్పుడప్పుడు వారి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటాడు చిరంజీవి.

బిజీ లైఫ్ లో ఉండే చిరు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను బాగా పంచుకుంటాడు.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో పంచుకోగా అందులో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఉన్నాడు.

అంతేకాకుండా చిరంజీవి భార్య కూడా ఉండగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

చిరంజీవి తన భార్యతో హైదరాబాద్ లోని ఓ హోటల్ కు వెళ్లగా అక్కడ కపిల్ దేవ్ కనిపించాడని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు చిరంజీవి.

చాలా కాలం తర్వాత తన మిత్రుడు కపిల్ దేవ్ ను కలుసుకోవడం తనకు సంతోషంగా ఉందని.

పాత జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకున్నామని తెలిపాడు.ఇక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ లో నటించనున్నాడు.

అంతేకాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇక బాబి దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటించనున్నాడు చిరు.

ఢిల్లీలో సీఎం రేవంత్ ! ఎందుకు వెళ్ళారంటే ?