గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు నిజం చేస్తూ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
దిల్ రాజు ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు.
ఇక స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపొయింది.అయితే మల్టీ స్టారర్ చిత్రంగా ఉంటుందని అందరూ భావించిన కేవలం రామ్ చరణ్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు దిల్ రాజు రిలీజ్ చేసిన పోస్టర్ బట్టి అర్ధమవుతుంది.
ఇప్పటి వరకు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులని పలకరించిన శంకర్ మొదటి సారి స్ట్రైట్ తెలుగు సినిమా తెరకెక్కించడానికి రెడీ కావడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
రామ్ చరణ్ తో శంకర్ లాంటి టాప్ దర్శకుడు సినిమా చేయడానికి ముందుకి రావడం, మెగాస్టార్ కి కూడా సాధ్యం కాని క్రెడిట్ ని ఇప్పుడు అతని తనయుడు సాధించడం గొప్ప విషయం అని చెప్పాలి.
ఈ నేపధ్యంలో శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ గురించి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
నీ వరుస సినిమాలు భారత ఖ్యాతిని పెంచే దర్శకులతో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ప్రస్తుతం ఇండియన్ టాప్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ మళ్ళీ వెంటనే గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో మూవీ చేసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడం నిజంగా గొప్ప విషయమని చెప్పాలి.