కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత.. ?
TeluguStop.com
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతు ఈ రోజు కన్నూ మూశారు.
కాగా డాక్టర్ కర్రా రాజా రావు కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా నిన్న ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం అతనిని హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించారట.
ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రాజా రావు ఈ రోజు అనగా శనివారం తుది శ్వాస విడిచారని సన్నిహితులు పేర్కొన్నారు.
ఇకపోతే చింతలపూడి నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున రాజారావు పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత చింతలపూడి నియోజక వర్గానికి టీడీపీ తరపున కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు కొనసాగుతున్నారు.
ఇక ఈయనకు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు.కాగా రాజారావు మృతి పట్ల టీడీపీ నేతలు పలువురు తమ సంతాపం తెలియజేశారు.
తలను మార్చేసే కొత్త సిస్టమ్ను చూశారా.. చూస్తే షాకే..?