కుప్పకూలిన త్రివిధ దళాల అధిపతి ఆర్మీ హెలికాప్టర్..!!

భారత త్రివిధ దళాల అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది.

తమిళనాడులో జరిగిన ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం.

కానీ ట్రావెలర్ లిస్టులో మాత్రం తొమ్మిది మంది ఉన్నట్లు సరికొత్త విషయం బయటపడింది.

 జరిగిన ఈ పెన్ను ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే వార్త తెలుసుకున్న అనంతరం ఆర్మీతో పాటు పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.

సహాయక చర్యలు చేపట్టారు.విల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి టేక్ ఆఫ్ అయిన హెలికాప్టర్.

కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కుప్పకూలింది.దీంతో ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడ ప్రమాదంలో కింద పడిపోయిన ముగ్గురిని కాపాడి.

హాస్పిటల్ కి తరలించడం జరిగింది.ఇదిలా ఉంటే జరిగిన ప్రమాదాన్ని వాయుసేన కూడా ధృవీకరించడం జరిగింది.

అంతమాత్రమే కాకుండా ఘటనకు సంబంధించి విచారణ కూడా స్టార్ట్ చేసినట్లు.ఆదేశాలు ఇచ్చినట్లు ఐఏఎఫ్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో కూడా వెల్లడించింది.

 జరిగిన ప్రమాద ఘటన కి సంభందించి .కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి అన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంది.

వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..?