పూరి సాయం తీసుకుంటున్న బాలీవుడ్‌ ‘చత్రపతి’ మేకర్స్

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం వచ్చిన చత్రపతి సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా ను ఇప్పుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ రీమేక్‌ చేయబోతున్నాడు.

ఈ రీమేక్ కు వి వి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట కియారా అద్వానీని అనుకున్నారు.

కాని కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పింది.తెలుగులో ఆమె కు మంచి ఫాలోయింగ్‌ ఉంది.

కాని హిందీలో ఇప్పటికే ఆమె చేసిన సినిమాల కారణంగా ఆ మెను రీమేక్ లో నటింపజేస్తే బాగుంటుందని భావించారు.

అయితే కియారా అద్వానీ రీమేక్ కు ఓకే చెప్పలేదు.ఆమె నో చెప్పడంతో మరో హీరోయిన్ కోసం మేకర్స్ కిందా మీద పడుతున్నారు.

తాజాగా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అనన్య పాండే హీరోయిన్ గా ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ లైగర్ సినిమా రూపొందుతుంది.

ఆ సినిమా కు పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే.లైగర్‌ లో నటిస్తున్న అనన్య పాండే ను డైరెక్ట్‌ గా వినాయక్‌ టీం సంప్రదించగా నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తి అయ్యే వరకు కొత్త సినిమాలకు ఓ కే చెప్పలేను అంటూ తేల్చి చెప్పిందట.

దాంతో ఆమెను ఒప్పించాలంటూ పూరి జగన్నాద్‌ ను బెల్లంకొండ టీమ్‌ రిక్వెస్ట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరి బెల్లం కొండ తో నటించేందుకు అనన్యను పూరి ఒప్పిస్తాడా అనేది చూడాలి.

ఒక వేళ అనన్య పాండే నటిస్తే ఖచ్చితంగా బాలీవుడ్‌ చత్రపతి రీమేక్‌ మంచి క్రేజ్‌ ను దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు.

మరో వారం రోజుల్లో ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

భూమ్మీద ఉన్న మొత్తం వాటర్‌లో నదుల శాతం ఎంత తక్కువ తెలిస్తే..?