పూరి బెస్ట్ పార్ట్నర్ అంటూ ట్వీట్ చేసిన ఛార్మి.. నెట్టింట్లో వైరల్!

పూరి జగన్నాథ్ ఛార్మి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వీరి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి.

సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా వీరి గురించి గుస గుసలు వినిపిస్తుంటాయ్.

అంత స్ట్రాంగ్ బంధం వీరిది.ఇక ఈ నేపథ్యంలోనే నిన్న పూరి జగన్నాథ్ పుట్టినరోజు.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు సోషల్ మీడియా బద్దలయ్యేలా సెలబ్రెటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వచ్చాయ్.

మహేష్ బాబు నుంచి రాజమౌళి వరకు అందరూ పూరి జగన్నాథ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఇక అలానే పూరి జగన్నాథ్ బెస్ట్ ఫ్రెండ్ ఛార్మి కూడా ఓ రేంజ్ లో విష్ చేసింది.

ఆ విషెస్ చూసిన వారందరు షాక్ కి గురయ్యారు అంటే నమ్మండి.ఎందుకంటే పూరి జగన్నాథ్ తనకు బెస్ట్ పార్ట్నర్ అంటూ విష్ చేసేసింది.

ఛార్మి విష్ చేస్తూ.''లెక్కలేనంత ప్రేమ ఉన్న వ్యక్తి మీరు.

నా సంరక్షకుడు, నా బెస్ట్ ఫ్రెండ్, జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి, మంచి వ్యాపార భాగస్వామి.

మీరు ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్న'' అంటూ పూరిని పలు రకాలుగా పొగిడేసింది ఛార్మి.

దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

పూరి జగన్నాథ్ అంటే ఎంత ఇష్టం ఛార్మి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా పూరి జగన్నాథ్ అన్ని సినిమాలకు ఛార్మినే పూరి కనెక్టస్ బ్యానర్ కింద నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గతంలో ఓ మేనేజర్ చేతిలో ఆస్తులు అన్ని పోగొట్టుకుని అతని బాధ్యతలు అన్ని ఛార్మినే చూసుకుంటుంది.

ఇక ఆ సమయం నుంచి పూరి జగన్నాథ్ ఎక్కువగా చార్మీతోనే కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్.

అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. విచారణకు దూరంగా కాంగ్రెస్ నేతలు