ఎవడు రీమేక్ మెగా ఫ్యాన్స్ లో టెన్షన్?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ఎవడు సినిమా ఏ రేంజ్ లో హిట్టయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక ప్రయోగాత్మకమైన చిత్రంగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన విధానం అందరిని ఆకట్టుకుంది.

అయితే ఆ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

"""/"/ దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ రీమేక్ కు మిలాప్ జవేరి దర్శకత్వం వహించనున్నాడు.

ఇక కథానాయకులలో మార్పులు చేయకుండా అల్లు అర్జున్ రామ్ చరణ్ లనే సెలెక్ట్ చేసుకున్నారు.

మెగా అభిమానుల్లో ఇది కాస్త అలజడి రేపే విషయమే.ఎందుకంటే గతంలో చరణ్ బాలీవుడ్ లో చేసిన జంజీర్ రీమేక్ డిజాస్టర్ గా నిలిచింది.

మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మరో రీమేక్ తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. """/"/ బాలీవుడ్ జనాలు రామ్ చరణ్ ని ఎంతవరకు ఆధరిస్తారనేది పెద్ద సందేహమే.

అదే విధంగా ఎవడును హిందీలో డబ్ చేయగా యూ ట్యూబ్ లో 44 మిలియన్ల వ్యూవ్స్ ని దాటేసింది.

మరోసారి ఆ కథను తెరకెక్కిస్తే బాలీవుడ్ జనాలు చూస్తారా? అనే భయం ఫ్యాన్స్ లో మొదలవుతోంది.

మరి ఎవడు సినిమాను బాలీవుడ్ జనాలకు ఏ విధంగా చూపిస్తారో చూడాలి.

వైరల్: ఇందుకే కాబోలు సచిన్ ను క్రికెట్ గాడ్ అనేది..