జీవితంలో కష్టాలు దూరమవ్వాలంటే.. పూజతో పాటు ఈ మంత్రాలను పఠించాలి..!

సనాతన ధర్మంలో ఆరాధన అనేది మన జీవితంలో ఏర్పడే సమస్యలను అధిగమించడానికి, భగవంతుడిని చేరుకోవడానికి ఒక మార్గంగా పరిగణిస్తారు.

దైవాన్ని కొలుస్తూ మనస్పూర్తిగా చేసే పూజలు ( Pooja ) నియమా నిష్టలతో చేస్తే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.

అదే సమయంలో కొన్ని మంత్రాలు( Mantras ) పాటించడం వల్ల కూడా భగవంతుని అనుగ్రహం పొందడానికి మంచి మార్గమని పురాణాలు చెబుతున్నాయి.

సనాతన ధర్మం ప్రకారం మనిషి మంత్రాలను పాటించడం లేదా వాటిని వినడం ద్వారా శక్తిని పొందుతాడు.

ఈ మంత్రాలు చాలా అద్భుతం అని నిరూపించబడ్డాయి.మంత్రాలను హృదయ పూర్వకంగా జపిస్తే జీవితంలో డబ్బు కష్టాలు, అనారోగ్యం ఇంటిలో ఏర్పడే ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి.

ఏ మంత్రాలన్నీ ఎలా జపించాలో, ఈ మంత్రాలను జపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలు దూరం అయిపోతాయి.

అలాగే ఈ మంత్రాన్ని జపించడం వల్ల హనుమంతుడు( Hanuman ) అన్ని కష్టాలను దూరం చేస్తాడు.

శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నప్పుడు జపించడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల పనిలో విజయం సాధించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాల్లో, పెళ్లిల్లో విఘ్నలు కలగకుండా ఈ మంత్రాన్ని జపించి గణపతిని పూజించాలి.

"""/" / ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా రోజుల నుంచి మీ మనసులో ఉన్న మంచి మంచి కోరికలు నెరవేరుతాయి.

అలాగే ఈ మంత్రం జపించడం వల్ల అదృష్టం ఎప్పుడు మీ వెంట ఉంటుంది.

ఓం ఘృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉన్నా లేదా సూర్య దోషం ఉన్న సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఈ దోషాలు దూరం అయిపోతాయి.

ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై శుభాలు కలుగుతాయి.

పవన్ కళ్యాణ్ నీ లాంచ్ చేయడం కోసం చిరంజీవి ఇంత భారీ ప్లాన్ చేశారా ?