చంద్రబాబు పాపం పండింది..: మంత్రి జోగి రమేశ్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు పాపం పండిందన్న ఆయన ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు.

చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి యాత్ర చేస్తోందన్నారు మంత్రి జోగి రమేశ్.

అయితే నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు.సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు.

సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని వెల్లడించారు.ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దేవర బెనిఫిట్ షో టికెట్ ధర తెలిస్తే  గుండె ఆగిపోవాల్సిందే.. ధర ఎంతంటే?