మరో స్కాం లోనూ చంద్రబాబు పాత్ర ! ‘సజ్జల’ సంచలన ఆరోపణలు

టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు,  వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) సంచలన ఆరోపణలు చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు,  ఫైబర్ గ్రిడ్ స్కాం లోను చంద్రబాబు పాత్ర ఉందని సజ్జల సంచలన రోపణలు చేశారు.

ఇక చంద్రబాబు అరెస్టుపై ఏపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల పైన సజ్జల స్పందించారు .

స్కిల్ డెవలప్మెంట్ స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుందని సజ్జల ప్రశ్నించారు.డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేసారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

  లక్ష మంది గోబల్స్ కలిస్తే చంద్రబాబు అవుతారని సజ్జల విమర్శించారు .

చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని , తాము ప్రచారం చేసే అసత్యాలను జనం నమ్మక చస్తారా అని టిడిపి భావిస్తూ ఉందని విమర్శించారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన సజ్జల చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో మీడియా సపోర్ట్ చేస్తుందని విమర్శించారు .

"""/" /  ఎల్లో మీడియాకు వాస్తవాలతో సంబంధం లేదని విమర్శించారు.చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారని,  అవినీతికి పాల్పడిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే అదేదో ప్రజా జీవితానికి పెద్ద అగాధం కలిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అంటే తోడు దొంగల పార్టీ అని,  ఈ తోడు దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబు అని సజ్జల విమర్శించారు.

స్కిల్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని,  ఢిల్లీలో నారా లోకేష్( Nara Lokesh ) కు పనేంటి అని ఆయన నిలదీశారు .

ఈ 20 రోజుల్లో లోకేష్  ముఠా నాన యాగి చేస్తోందని , ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైందని సజ్జల ఆరోపించారు.

"""/" / సాక్షాదారాలతో దొరికితే కోర్టు రిమాండ్ కు పంపిందని,  అయినప్పటికీ జరిగిన స్కాం పై వీరంతా మాట్లాడడం లేదని , దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నిమిషానికి 4 కోట్ల రూపాయలు తీసుకున్న హీరో ఎవరో తెలుసా?