చంద్రబాబుకు ప్రాణహాని తలపెడుతున్నారు..: నారా లోకేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అనారోగ్యంతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు.అందుకే చంద్రబాబుకు జైలులో వసతులు కల్పించడం లేదన్నారు.

హెల్త్ బులెటిన్ పై పెట్టిన శ్రద్ధ చంద్రబాబు ఆరోగ్యంపై పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో జైలు అధికారుల తీరు అనుమానంగా ఉందని ఆరోపణలు చేశారు.చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష అని ప్రశ్నించిన లోకేశ్ చంద్రబాబుకు హాని జరిగితే ప్రభుత్వం, జైలు అధికారులదే బాధ్యతని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇవాళ రాజమండ్రికి వస్తున్న లోకేశ్ సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

శ్రీదేవి ఒక అజ్ఞాని.. ఆమెకు లోకజ్ఞానం లేదు: ఆర్జీవీ