చంద్రబాబు కందుకూరు సభలో అపశృతి పెరుగుతున్న మృతుల సంఖ్య...!!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనాలు తండోపతండాలుగా వస్తున్న సంగతి తెలిసిందే.దీంతో నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సభలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

భారీ జన సందోహం రావడంతో కార్యకర్తల మధ్య తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో 8 మంది మృతి చెందారు.

మరి కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.వీరిలో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.

కాగా దుర్ఘటన జరగక ముందు తోపులాట జరుగుతున్న సమయంలోనే కార్యకర్తలను.చంద్రబాబు హెచ్చరించారు.

వ్యాన్ వద్ద ఘటన జరగటంతో.దానికి ముందే ఆ వ్యాన్ వద్ద జనాలు ఉండొద్దని దిగిపోవాలని చంద్రబాబు సూచించారు.

చెబితే వినాలి.అక్కడ ప్రాబ్లం ఉంది.

మీటింగ్ సక్సెస్ కావాలి.ఎవరు ఆ వ్యాన్ వద్ద ఉండొద్దు.

అని చంద్రబాబు హెచ్చరించిన కాసేపటికే ఘటన జరగటం తీవ్ర విషాదం మిగిల్చింది.ఈ క్రమంలో మృతులు పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తన సభకి వచ్చి సామాన్యులు చనిపోవడం ఆవేదన కలిగించిందని తెలిపారు.బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.

పోలీసులు మరింత బందోబస్తు కల్పించాల్సి ఉండాల్సిందని చంద్రబాబు అన్నారు.