వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపాటు

ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంలో రోజు రోజుకు కక్ష సాధింపులు పెరుగుతున్నాయని ఆరోపించారు.ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులను మాత్రమే నమ్ముకుందని విమర్శించారు.

అక్రమ కేసులతో టీడీపీ నేతలను భయపెట్టాలనుకోవడం మానుకోవాలని సూచించారు.సీఐడీ అనేది దర్యాప్తు ఏజెన్సీనా లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని ప్రశ్నించారు.

కోర్టులు చీవాట్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వ తీరు మారడం లేదని మండిపడ్డారు.

ఆ హామీతో … కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి  ?