మోడీకి, లోక్ సభ స్పీకర్ కి చంద్రబాబు లెటర్..!!

125వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరం, విశాఖపట్నంలో ప్రధాని మోడీ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో జులై 4వ తారీఖు పాల్గొంటున్నారు.

దీనిలో భాగంగా ముందుగా భీమవరంలో అతిపెద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహాని ఆవిష్కరించనున్నారు.ఇక ఆ తర్వాత విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.

"""/" /   ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లెటర్ లు రాయడం జరిగింది.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలలో కేంద్రం అల్లూరిని చేర్చడం నిజంగా సంతోషమని తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

భీమవరం లో అల్లూరి విగ్రహావిష్కరణ కచ్చితంగా ప్రజల మనసుల్లో గుర్తుండిపోతుందని తెలియజేశారు.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?