రాష్ట్రానికి పట్టిన 5 ఏళ్ల శనిని వదిలించుకునేందుకు సిద్ధం కావాలి – చంద్రబాబు

ఏలూరు: నిడదవోలులో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు.చంద్రబాబు ముందు పోటాపోటీ గా బలప్రదర్శనకు దిగిన శేషారావు, కుందుల సత్యనారాయణ వర్గాలు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కామెంట్స్.రాష్ట్రానికి పట్టిన 5ఏళ్ల శనిని వదిలించుకునేందుకు సిద్ధం కావాలి.

సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనం అవుతోంది.ఒక సైకో ఊరికో సైకోని తయారు చేస్తున్నాడు.

వైకాపా సైకోలను భూ స్థాపితం చేసే వరకూ నేను పోరాడుతా.రాష్ట్రంలో వ్యాపారం చేయలేమంటూ రూ.

9వేల కోట్ల పెట్టుబడుల్ని అమర్ రాజా తెలంగాణ కు తరలించింది.ఏపీలో వ్యాపారం చేయలేమoటూ వేధింపులు తాళలేక తెలంగాణ కు పారిపోయారు.

అమర్ రాజా తో పాటు నారాయణ ను వేధిస్తున్నారు.పార్టీని నమ్ముకుని ఉన్నారు కాబట్టే ఎన్ని కేసులైనా భరిస్తున్నారు.

పులివెందుల నుంచి మనుషుల్ని తెచ్చి ఎన్నికలు చేయటానికా ? టీచర్లు ఎన్నికల్లో వద్దంటున్నారు.

అoత:పురంలో జరిగిన బాబాయి హత్య కేసు సాక్ష్యాలు తారుమారు చేశారు.రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదు, ధాన్యం డబ్బులు రావు.

ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే, పోలీసులతో గోడలు దూకించి మరీ కేసులు పెట్టిస్తున్నారు.నక్సల్స్, సంఘ విద్రోహ సక్తులపై వీరోచితంగా పోరాడిన పోలీసులకు గోడలు దూకే ఖర్మ పట్టించారు.

ముద్దులకు మురిసిపోయి దొంగ చేతికి తాళాలు ఇచ్చారు.రాష్ట్రంలో తయారయ్యే కల్తీ మద్యం బ్రాండ్ లు ఎవరి చేతుల్లో ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

పోయిన ఏ2 ఫోన్ ఇంతవరకు ఎందుకు కనుక్కోలేదు.ఫోన్లు పోయిన చాలామంది పోలీసులకు ఫిర్యాదులు చేయరు.

విజయసాయి కరుడు గట్టిన నేరస్థుడు కాబట్టే ముందు జాగ్రత్తగా తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పూనకం నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిస్తోంది.

బాధ్యులపై కఠిన చర్యలు..అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశం