మొద్దబ్బాయిలు అంటూ బాబు విమర్శలు.. జై జగన్ అంటూ తల్లితండ్రుల కౌంటర్

టిడిపి అధినేత చంద్రబాబు కు ఊహించని పరిణామం ఎదురైంది .జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.

  ప్రజల్లో చులకన చేసేందుకు ప్రయత్నించగా , తిరిగి అది ఆయననే ఇబ్బంది పెట్టిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు .

దీనికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు ఆయన పూర్తి చేశారు.  కానీ చివరి నిమిషంలో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో ఇంకా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు నోచుకోలేదు.

కోర్టు తీర్పును అనుసరించి ముందడుగు వేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ఇది ఇలా ఉంటే మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని టిడిపి వ్యతిరేకిస్తూ ఉంది.

ఇది అవివేకమైన చర్య గా అభివర్ణిస్తూ జగన్ ను తప్పుబడుతూ టిడిపి విమర్శలు చేస్తోంది.

అయితే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టే విషయం లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆమోదాన్ని తీసుకుంది.

ప్రస్తుతం ఏపీలో జిల్లాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన చేస్తున్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో బాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని తప్పుబడుతూ.

  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది.దీని వల్ల మన పిల్లలు అంతా మొద్దబ్బాయిలుగా మారుతారు అంటూ వ్యాఖ్యానించారు.

"""/"/ ఇప్పటికే తమిళనాడుతో పాటు,  ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల చోటు చేసుకున్న పరిణామాలను బాబు గుర్తు చేసే ప్రయత్నం చేయగా.

అక్కడ గుమిగూడిన విద్యార్థుల తల్లిదండ్రుల లో కొంతమంది జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

  తమకు ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం కావాల్సిందేనంటూ వారు నినాదాలు చేయడం వంటి పరిణామాలతో బాబు ఉలిక్కి పడ్డారు.

వెంటనే తేరుకుని ఆ నినాదాలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను నివారించే ప్రయత్నం చేస్తూనే అక్కడినుంచి వెళ్లిపోయారు.

నా కూతుర్ల కోసం పోరాటం చేయాల్సి వస్తోంది.. ఎమోషనల్ అయినా తారకరత్న వైఫ్!