నెల్లిమర్ల బహిరంగ సభలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ చంద్రబాబు
TeluguStop.com
నెల్లిమర్ల "వారాహి విజయభేరి" ( Varahi Vijayabheri ) బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్( Chandrababu , Pawan Kalyan ) హాజరయ్యారు.
ఈ సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఉత్తరాంధ్ర కోసం కనీసం ఒక్క ప్రాజెక్టు అయిన తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.
ఏ ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది.
కాబట్టి అప్పట్లో భోగాపురంకి విమానాశ్రయం తీసుకురావడం జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లిమర్లలో 2025 వ సంవత్సరం కల్లా.
అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేస్తానని చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది.విమానాశ్రయం వస్తే పరిశ్రమలు వస్తాయి.
ఈ క్రమంలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. """/" /
పోలవరం పూర్తి కావాలి.
ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పూర్తి కావాలి అని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.
నదుల అనుసంధానం పూర్తయ్యి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని ఆకాంక్షించెను.కానీ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి.
ఇష్టానుసారంగా పాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్డీఏ సభలకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీలో గుబులు మొదలైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ) అన్నారు.
'ప్రజలందరినీ జగన్ తన బానిసలుగా చూస్తున్నారు.జగన్ అహంకారి, విధ్వంసకారుడు.
ఎన్నికలప్పుడు ఏదో ఒక నాటకం ఆడటం జగన్కు అలవాటు.ఇప్పడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు.ప్రజల కలలు చెరిపేసిన దుర్మార్గుడు జగన్' అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.