నాలుగు ఏళ్ల నరకమంటూ వీడియో రిలీజ్ చేసిన చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవతారంగా ఉంటున్నాయి.వచ్చే ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.

ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఎవరికివారు తమ వ్యూహాలను వేసుకుంటూ దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ( TDP )కి చెందిన కీలక నాయకులు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రశ్నించాల్సిన విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu Naidu ) తన ట్విట్టర్ లో నాలుగేళ్ల నరకమంటూ వైసీపీ పాలనపై వీడియో రిలీజ్ చేశారు.

"""/" / "ఎంత సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించినా, కరుణామయుడిలా మరెంత నటించినా, లోపలున్న క్రూరమైన వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుంది.

ఆ వ్యక్తిత్వమే తన అనుచరులకు మార్గదర్శకత్వం అవుతుంది.అదే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తుంది".

అని పోస్ట్ పెట్టి చంద్రబాబు వీడియో రిలీజ్ చేశారు.ఆ వీడియోలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా( CM Jagan ) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న హత్యలు.

ఇంకా అనేక విషయాలను చూపించడం జరిగింది.నాలుగేళ్ల నరకం అంటూ చంద్రబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అమానుషం.. యువకుడిపై దాడి ఆపై నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు..