ఎమ్యెల్యే చింతమనేని పై బాబు కస్సు బుస్సు !

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి కోపం వచ్చింది.తరుచూ వివాదాల్లో చిక్కుకుంటూ.

పార్టీ పరువును బజారున పడేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదంటూ బాబు .ప్రభాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ తదితరులు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబ శివ కృష్ణారావుపై దాడి చేసిన ఘటనను పలువురు సీనియర్ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఒకరు చేసే తప్పుకు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవల్సి వస్తుందని ముఖ్యమంత్రికి తెలిపారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు.ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

కేవలం పనిచేస్తే సరిపోదని, పద్ధతిగా ఉంటనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు.తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని బాబు హెచ్చరించారు.

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో నిందితులకు బెయిల్