చంద్రబాబు, లోకేశ్ మీరు ఏపీకీ రావద్దు.. విజయసాయిరెడ్డి విన్నపం.. ?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమయం వచ్చినప్పుడల్లా టీడీపీ నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై విమర్శలు కురిపించడం తెలిసింద ఇక తాజాగా ఏపీలో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో విజయసాయిరెడ్డి, చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై విమర్శలు వదులుతున్నారు.

ఈ నేపధ్యంలో జగన్ ఏపీకీ చేస్తున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఏపీ ప్రజలు ఎంతలా ఈసడించుకుంటున్నా, అధికారం పై బాబుకు ఆశ చావడం లేదని విమర్శించారు.

అదీగాక ప్రస్తుతం పక్క రాష్ట్రంలో తండ్రీకొడుకులు ఇద్దరూ ఉన్నారని అందుకే ఏపీలో ముందే వర్షాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు.

కరువుకు మారు పేరుగా ఉన్న ఈ పెద్ద బాబు, చిన్న బాబులు ఇద్దరు మరో నాలుగు నెలల పాటు ఏపీలో కాలుపెట్టక పోతే ఈ రుతుపవనాలు భారీ వర్షాలను కుమ్మరిస్తాయని, టీడీపీలో ఉన్న పరాన్న జీవులైన వీరిద్దరు పక్కరాష్ట్రంలో ఉంటే ఏపీ బాగు పడుతుందని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య గొడవ ఏంటి ? 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదు ?