స్కిల్ డెవలప్‎మెంట్ స్కామ్‎లో చంద్రబాబే ప్రధాన సూత్రధారి..: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ

స్కిల్ డెవలప్‎మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు.

స్కిల్ డెవలప్‎మెంట్ లో మొత్తం రూ.550 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారని సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే షెల్ కంపెనీలకు రూ.371 కోట్లు తరలించారన్నారు.

ఈ కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన సూత్రధారి అని చెప్పారు.చంద్రబాబే నిధులు విడుదల చేశారన్న ఆయన అగ్రిమెంట్లు అన్నీ చంద్రబాబు చెబితేనే జరిగాయని స్పష్టం చేశారు.

డిజైన్ టెక్ అనే కంపెనీకి దాని నుంచి షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని తెలిపారు.