చంద్రబాబు దొరికిన దొంగ..: మంత్రి సిదిరి

విశాఖపట్నంలోని తగరపు వలసలో వైసీపీ సామాజిక సాధికార బహిరంగ సభ జరిగింది.ఈ సభకు హాజరైన మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

భీమిలి నియోజకవర్గం మత్స్యకారుల కంచుకోటని మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు.దొంగ పేరుతో అనేక సినిమా పేర్లు వచ్చాయన్న ఆయన అసలు పేరు చెప్తానన్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు దొరికిన దొంగని చెప్పారు.చంద్రబాబు తనయుడు లోకేశ్ పప్పు.

మీ పార్టీ తుప్పు అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు జైలుకు వెళ్లి 50 రోజులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే జగన్ బలహీన వర్గాలకు అధికారం ఇచ్చారని తెలిపారు.