నాపైనే కేసు పెడతావా ఖబడ్దార్

విజయనగరం జిల్లా రామతీర్థంలోని రామాలయంలోకి కొంత మంది దుండగులు ప్రవేశించి అక్కడ ఉన్న రాముడి విగ్రహా తలను తొలగించారు.

ఈ విషయంపై రాష్ట్రంలో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతుంది.ఇప్పటికే కొంతమంది రాజకీయనాయకులు రామతీర్థం వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనపై అరా తీస్తున్నారు.

ఈ ఘటనపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కారు పై ఫైర్ అయ్యాడు.

రామ తీర్థం వెళ్ళిన తనపై పోలీసు కేసు నమోదు కావడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నాపైనే కేసు పెడతావా ముఖ్యమంత్రి ఖబడ్డార్ అంటూ నిప్పులు చెరిగాడు. """/"/ నేను రామతీర్థం ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించాడు.

రామతీర్థ ఆలయంపై దాడి జరిగి చాలా రోజులు అవ్వుతున్న వైసీపీ ప్రభుత్వం ఏ గడ్డి పీకుతుందని ప్రశ్నించాడు.

జగన్ ఓ క్రిస్టియన్ కావచ్చు ఆయన నమ్మకాలు ఆయనకు ఉంటే మా నమ్మకాలు మాకు ఉంటాయని అన్నాడు.

సాయి రెడ్డిని తీసుకువెళ్లి మీరు పూజలు చేస్తారాని ప్రశ్నించాడు.హిందువులు ఎక్కువగా ఉండే దేశంలో వాళ్ళ మనోభావాలను గౌరవించాలని కోరాడు.

ఆ పని చేయకుండా బన్నీ షూటింగుకు వెళ్లరా.. ఇప్పటికీ ఆ రూల్ పాటిస్తున్నారా?