నెల్లూరు రోడ్ షోలో జగన్ కి సవాల్ చేసిన చంద్రబాబు..!!

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో రోడ్షో నిర్వహించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీలో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందని అప్పుడు కట్టిన భవనాలకు ప్రస్తుతం రంగులు వేసుకుని ఈ ప్రభుత్వం సంబరపడుతోంది అంటూ వైసీపీ పై మండిపడ్డారు.

అమరావతి ని నాశనం చేశారని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రశ్నించకుండా ఉండటం దారుణం అసలు నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రివి అంటూ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు.అప్పట్లో టీడీపీ ఎంపీలను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

? ఇప్పుడు నేను సవాలు విసురుతున్న మీ ఎంపీల చేత రాజీనామా చేయించి గలవా అంటూ జగన్ కి చంద్రబాబు సవాల్ విసిరారు.

  వైసీపీ అధికారంలోకి వస్తే రెండేళ్లయింది ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అటువంటి పార్టీకి తిరుపతి ఉప ఎన్నికలలో ఓటు వేయకూడదని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ గెలిస్తే జగన్ తాడేపల్లి ఇంటి నుండి రోడ్డు మీదకు రావడం గ్యారెంటీ అని, రాష్ట్రంలో ధరలు తగ్గుతాయని ప్రభుత్వ యంత్రాంగం కరెక్ట్ గా పని చేస్తుందని స్పష్టం చేశారు.

కాళ్లు చేతులు నల్లగా మారాయా.. ఈ సింపుల్ రెమెడీతో తెల్లగా మెరిపించుకోండి!