రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్..!

కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు.

ఈ మేరకు ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం.

ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు టీడీపీ రిప్రజెంటేషన్ కు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా సమాధానం ఇచ్చారు.

వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో సుమారు 5 లక్షల 64 వేల ఓట్లను తొలగించామని చెప్పారు.

అలాగే ఓటర్ల జాబితా తప్పిదాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

ఇంట్లో కూర్చుని మాట్లాడే నువ్వు రూపాయి అయినా ఇచ్చావా.. కిర్రాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్!