'బ్యాచిలర్' గా చైతూ ఫస్ట్ స్పీచ్..ఎందుకంత ఆసక్తి అంటే!

అక్కినేని అఖిల్ ప్రస్తుతంమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయినా కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.

ఇక ఎట్టకేలకు ఈ సినిమాను దసరా రేస్ లో నిలబెట్ట బోతున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.ఇందులో అఖిల్ పూజా హెగ్డే తో రొమాన్స్ చేసాడు.

అందుకే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది చిత్ర యూనిట్.

ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేందుకు ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో చేయబోతున్నారు.

"""/"/ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అఖిల్ అన్న నాగ్ చైతన్య గెస్ట్ గా రాబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ పోస్టర్ విడుదల చేసారు.

అయితే నాగ చైతన్య గెస్ట్ అంటే మాములుగా అంత ఆసక్తి వచ్చేది కాదు.

కానీ ఇప్పుడు చైతూ విడాకులు తర్వాత మొదటి స్పీచ్ అవ్వబోతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది.

ఈ స్పీచ్ లో చైతూ సమంత గురించి ఏమైనా మాట్లాడతాడో లేదో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

"""/"/ సమంత తో వివాహ బంధం ముగించిన తర్వాత మళ్ళీ నాగ చైతన్య బ్యాచిలర్ అయ్యాడు.

దీంతో తమ్ముడు బ్యాచిలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చైతూ స్పీచ్ పు ఉత్కంఠ నెలకొంది.

చైతు హ్యాపీ గా ఉంటాడా లేదంటే సాడ్ గా కనిపిస్తాడా అని కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు.

అయితే చైతు సంతోషంగా కనిపిస్తే మాత్రం సమంతపై కొంత అయినా ట్రోలింగ్ తగ్గుతుందని భావిస్తున్నారు.

చూడాలి మరి చైతూ స్పీచ్ సింపుల్ గా ముగిస్తాడా లేదంటే మిగతా విషయాల గురించి కూడా మాట్లాడతాడా.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై సంచలన తీర్పు