పండగకే వస్తోన్న ప్రేమకథ.. ఈసారైనా ఫిక్సేనా?

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం లవ్ స్టోరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల, ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే ఈ సినిమా రిలీజ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాను లాక్‌డౌన్ పూర్తవ్వగానే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ సినిమాను ఆగస్టులో కాకుండా దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో పండగకే ఈ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు వదలాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

దసరా వరకు కరోనా భయం ప్రజల్లో పోతుందని, థియేటర్లు కూడా తెరుచుకుంటాయని దర్శకనిర్మాతలు అంటున్నారు.

మరి ఈ విషయంలో శేఖర్ కమ్ముల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ఇప్పటికే ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.

కేసీఆర్ ఎక్కడ ?  కేటీఆర్ ను ఆడేసుకున్న రేవంత్