హైదరాబాదు నుంచి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కృష్ణాజిల్లా: హైదరాబాదు నుంచి గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

గన్నవరం విమానాశ్రయం లో కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు, బిజెపి నాయకులు.

ఏలూరు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

మోడీ రైతులకు సంబంధించి డిజిటల్‌ ట్రాన్సేషన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

రైతుల కోసం ప్రత్యేకంగా సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశాం.ఏలూరు లో సర్వీసు సెంటర్ ను ప్రధాని వర్చ్యువల్ గా ఈరోజు ప్రారంభిస్తారు.

అమరావతి రాజధాని‌ విషయంలో మా పార్టీ నేతలు ఇప్పటికే చెప్పారు.నాది ప్రత్యేక అభిప్రాయం ఉండదు.

అమరావతికి బిజెపి అండగా ఉంటుంది.రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు సరి కాదు ఏ రాజకీయ పార్టీ అయినా కార్యక్రమాలు చేసుకోవచ్చు.

రైతులు ఆందోళన‌ చేస్తుంటే.వారికి మోడీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది.

వారితో చర్చలు చేసి, మోడీ సమస్య తెలుసుకుని చట్టాలు రద్దు చేశారు.ప్రజా స్వామ్యంలో పార్టీల కార్యక్రమాలను అడ్డుకోవడం తగదు.