ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్వహించిన చాకలి ఐలమ్మ 128వ జయం( Chakali Ilamma )తి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు

అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి అన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు

సాయుధ పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు.

ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందని,ఆ యోధురాలి స్పూర్తితో సాగుతున్న కేసీఆర్ పాలన ద్వారా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా నిలబెట్టాయని అన్నారు.

జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యలో ఐలమ్మ పోరాట స్ఫూర్తితో అధిగమించాలన్నారు.కేసీఆర్‌( Kcr ) హయాంలోనే తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం లభించిందని,ఐలమ్మ ఆశయాలను నెరవేర్చడమే ఆమెకు మనమంతా ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

కెనడా ఇమ్మిగ్రేషన్ ప్లాన్ 2025 : పర్మినెంట్ రెసిడెన్సీ ఎవరికీ? ..బహిష్కరణ వేటు ఎవరిపై?

కెనడా ఇమ్మిగ్రేషన్ ప్లాన్ 2025 : పర్మినెంట్ రెసిడెన్సీ ఎవరికీ? ..బహిష్కరణ వేటు ఎవరిపై?