లాలూప్రసాద్ యాదవ్‎ను ప్రశ్నించనున్న సీబీఐ..!

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఇవాళ ప్రశ్నించనున్నారు.

ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి లాలూను విచారించనున్నారు అధికారులు.అయితే లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్ మెంట్ లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీలో గ్రూప్ డీ సంబంధిత పోస్టులను అక్రమ దారిలో కట్టబెట్టినట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రీదేవీ, కూతుళ్లు మీసా, హేమ పేర్లను చేర్చిన విషయం తెలిసిందే.

Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE