పేపర్ లీక్ పై సీబీఐ విచారణ జరపాలి.. రేవంత్ రెడ్డి

బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గు అనిపిస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

దేశం అంతటా ఎమ్మెల్యే చరిత్ర తెలిసినా కేసీఆర్ కు తెలియడం లేదా అని ప్రశ్నించారు.

పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్ కు ఏమి అనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

బీఆర్ఎస్ నేతలు ఇసుక, భూమి, మైన్ లలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.టీఎస్పీఎస్సీ కమిషన్ లోపభూయిష్టంగా ఉందన్నారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లు చేతులు మారాయని మండిపడ్డారు.ఇప్పటికైనా పేపర్ లీక్ లపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తోపు డ్యాన్సర్ అయినా.. జూ.ఎన్టీఆర్‌కి డ్యాన్స్ అంటే సచ్చే భయమట..?