అది చూడటానికి ఓ అందమైన లేక.కానీ ఒకే రోజు రాత్రి 1,746కు పైగా ప్రాణాలను తీసిన కిల్లర్ సరసు అది.
ఆ సరసు చుట్టూ గ్రామాలూ.ఆ గ్రామాలలో ఎంతో సంతోషంగా జీవించే మనుషులు.
అలాంటి మనుషులు ఏ రోగంతోనూ మరణించలేదు.ఆ సరసు పొంగలేదు.
రాత్రికి అంత ఎంతో ఆనందంగా భోజనం చేసి నిద్ర పోయారు.ఆలా నిద్రపోయిన వారు అంత ఉదయానికి లేవలేదు.
కేవలం ఆ ఒక్క మనుషులే కాదు అక్కడ ఉన్న జంతువులు, పక్షులు కూడా మరణించాయి.
ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారు.బెడ్ పై పడుకున్న వారు పడుకున్నట్టే మరణనించారు.
రాత్రికి రాత్రి దాదాపు 1,746 మంది మరణించారు.అందరి నోటి, ముక్కు నుండే రక్తాలు వచ్చి మరణించారు.
ఏంటి ఈ మిస్టరీ అనుకుంటున్నారా? అవును అప్పుడు అందరూ అలానే అనుకున్నారు.కానీ చివరికి తెలిసింది.
ఆ సరస్సు నుండి విడుదలైన ఘాటైన వాసన ఆ మూడు గ్రామాలను చుట్టుముట్టింది.
అక్కడ ఆ సరస్సు నుండి విడుదలైన భారీ మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ కారణంగానే అక్కడ అంత మంది ప్రాణాలు విడిచారు అని.
దాదాపు 50 మీటర్ల మందంతో ఉన్న ఆ వాయువు క్షన్లో చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించడం వల్ల CO2ను పీల్చిన గ్రామస్తులు అక్కడికక్కడే చనిపోయారు అని అక్కడకి వెళ్లిన పరిశోధకులు తెలిపారు.
ఈ దారుణమైన ఘటన 1986, ఆగస్టు 21న ఆఫ్రికాలోని కామెరూన్ ప్రాంతంలో జరిగింది.
ఆ మూడు గ్రామాల ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ గాలి వచ్చి అందరి జీవితాలు నాశనం చేసి వెళ్ళింది.
ఈ దారుణమైన ఘటనలో మొత్తం 5,246 ప్రాణాలు పోయాయి.అయితే మూడు గ్రామాల్లో 1,746 మంది ప్రజలు చనిపోయారు.
అలానే 3,500 పశువులు మరణించాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీ దరిద్రానికి కారణాలివే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!