విశాఖ బీచ్ రోడ్డులో కారు ప్రమాదం యువకుడు దుర్మరణం..!!

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు( Road Accidents ) రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

బస్సు ప్రమాదాలు ఇంకా రైలు ప్రమాదాలు ఈమధ్య ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఈ క్రమంలో చాలా ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్( Drunk And Drive ) తో పాటు మత్తు పదార్థాలు అని పోలీసులు చెప్పుకొస్తున్నారు.

ఇదే సమయంలో లైసెన్స్ లేని యువత కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారని లెక్కలు తెలియజేస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా విశాఖపట్నం బీచ్ రోడ్డు( Visakhapatnam Beach )లో కారు ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మరణించాడు.శనివారం ఐఎన్ఎస్ కళింగ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

అతివేగంగా కారు నడపడంతో.అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందంట.

ఇక అదే కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావటంతో క్షతగాత్రులకూ  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతి చెందిన యువకుడు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం పట్ల పోలీసులు స్పందిస్తూ మైనర్లు వాహనాలు నడిపిన.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన.మత్తుపదార్థాలు సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ లో కొండా సురేఖ ఒంటరయ్యారా ?