కళ్లెదుటే కొట్టుకుపోయిన కారు!

ఈ మధ్యకాలంలో వర్షాలు ఎలా పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొన్నటికి మొన్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఓ ఇల్లు ఉన్నట్టుండి పడిపోయి కొట్టకపోయింది.

ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం వద్ద కళ్లెదుటే ఓ కారు కొట్టుకుపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఈరోజు ఉదయం రాకేశ్‌, యూసూఫ్‌ కడప నుంచి బిజాపూర్‌కు కారులో బయల్దేరారు.

అయితే 63వ జాతీయ రహదారిపై రజాపురం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.అయినప్పటికీ ఆ వాగు దాటేందుకు ప్రయత్నించారు.

వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది.ఇంకా అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి కారులో కొట్టుకుపోతున్న ఇద్దరినీ కాపాడారు.

కానీ కారు మాత్రం వాగులో కొట్టుకుపోయింది.అయితే కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు సైతం వాగు దాటింది.

కాస్త ఉండి ఉంటే వరద ఉద్ధృతికి ఆర్టీసీ బస్సు సైతం కొట్టుకుపోయేది.తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

ఇంకా ఆ బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని బస్సు డ్రైవర్ తెలిపాడు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!