ఆస్కార్ వేదికపై నాటు నాటు డాన్స్ చేయలేం… తారక్ షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ అవార్డు ఈవెంట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన తెలుగు సినిమా ఆస్కార్ బరిలో ఉండటమే కారణం.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల ఏడాదికావస్తున్న కూడా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సినిమా హావ తగ్గటం లేదు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఎన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది.
"""/" /
దీంతో మార్చి 12వ తేదీన లాస్ ఏంజిల్స్ లో జరిగే ఆస్కార్ అవార్డు ఈవెంట్లో మన తెలుగు హీరోల అడుగుల చప్పుడుని వినేందుకు ప్రజలు ఎంత అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఆ క్షణాల కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడు.
ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొనటానికి అమెరికా వెళ్ళిన మన హీరోలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’ టీం రెడ్ కార్పెట్పై నడవడం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
"""/" /
ఈ ఇంటర్వ్యూలో వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు వేయటం గురించి ఎదురైన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.
“ఆ ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్లో చూడాలని ఆసక్తిగా ఉన్నాను.
మేము ఆ పాటకు డ్యాన్స్ వేస్తామని కచ్చితంగా చెప్పలేను.నాకు, రామ్ చరణ్కు రిహార్సల్స్ చేసే సమయం లేదు.
అందుకే మేము ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చేయలేకపోతున్నాం.ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డాన్స్ చేస్తూనే ఉంటాయి’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.
దీంతో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందర్నీ సందిగ్ధంలో పడేశాయి.తెలుగు హీరోలు ఇద్దరు కలిసి ఆస్కార్ వేదికపై డాన్స్ చేస్తే చూడాలని ఆశపడిన అభిమానుల కోరిక తీరుతుందో లేదో చూడాలి మరి.
తప్పు పైన తప్పు చేస్తున్న హీరో రాజ్ తరుణ్..ఇలా చేస్తే ఇంకా పాతాళానికే!