మంత్రి కొడాలి నాని పై దిమ్మతిరిగే కామెంట్లు చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..!!

సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని అంటే తనకెంతో ప్రత్యేకమైన అభిమానం అని చెప్పుకొచ్చారు.

జగన్ తర్వాత అంతా అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.ఆయన ఇంటర్వ్యూలు, అసెంబ్లీలో మాట్లాడే విధానం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా నియోజకవర్గం ప్రజలకు ఏదో మంచి చేయాలని నిత్యం ఆయన పడే తపన తనకెంతో స్ఫూర్తి నిలుస్తుందని తెలిపారు.

అదేవిధంగా గుడివాడ నియోజకవర్గం అనేసరికి మొదటిగా గుర్తొచ్చేది కొడాలి నాని అని అదేరీతిలో కొడాలి నాని అంటే గుర్తుకొచ్చేది గుడివాడ అని చెప్పుకొచ్చారు.

ఇదే రీతిలో నందికొట్కూరు నియోజకవర్గంలో గుర్తింపు తెచ్చుకోవాలని, కొడాలి నాని.గుడివాడ ప్రజలకు చేస్తున్న లాంటి సేవ చేయాలని ఉంది అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు.

ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గారి సాయం కూడా అవసరమని తెలిపారు.

ఇలాంటి పెద్ద పండుగకు తనని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటూ కొడాలి నాని ని అదే విధంగా ఎడ్ల బండ లాగుడు పందాలు నిర్వహించే ఎన్టీఆర్ టు వైయస్సార్ ట్రస్ట్ కి కృతజ్ఞతలు తెలిపారు.

 .

ఎలా ఉండే నయనతార ఎలా మారిపోయింది ? కారణం ఏంటి ?