గుంపు మేస్త్రి  రంగుపడుద్ది … రెచ్చిపోయిన బీఆర్ఎస్ 

మూసినది ప్రక్షాళన వ్యవహారంపై తెలంగాణ అధికార విపక్ష పార్టీల మధ్య మాటల దాడి జరుగుతూనే ఉంది.

మూసి ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిదమవుతుండడం, తదితర వ్యవహారాలపై బీఆర్ఎస్( BRS ) గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తోంది.

  దీనికి కాంగ్రెస్( Congress ) నుంచి కూడా అంతే బీ ఆర్ ఎస్ కు కౌంటర్ ఇస్తున్నారు.

  తాజాగా ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై( KTR ) విమర్శలు చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై( CM Revanth Reddy ) తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ విమర్శలు చేసింది.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా  కాంగ్రెస్ పైన , రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ చేసింది.

సున్నాలు,  కన్నాలు వేసే రేవంతూ నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ మహానగర పరువు తీస్తున్న కాంగ్రెస్ పార్టీ.

"""/" / నువ్వు హైదరాబాద్( Hyderabad ) బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు అంటూ ఎక్స్ లో స్వీట్ చేసింది .

బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించిన మూసి( Musi River ) పునర్జీవ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ 16500 కోట్లు.

ఇప్పుడు అది అమాంతం ఎందుకు పెరిగినట్లు ? అదే ప్రాజెక్టు తట్ట మట్టి ఎత్తకుండా వ్యయాన్ని రూ.

16,500 కోట్ల నుంచి రూ.1,50,000 కోట్లకు ఎందుకు పెంచినట్లు ? పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం ఎవరి జేబులు నింపడానికి ? మొదట మూసి సుందరీకరణకు రూ.

1,50,000 కోట్లు కావాలని అంటున్నావ్ అది నోరా లేక మోరా ? """/" / మూడు,  నాలుగు నెలల్లోనే లక్ష కోట్ల వ్యయం ఎలా పెరిగింది ? ఆ సొమ్ము అంతా ఢిల్లీకి కప్పం కట్టడానికా ? పనులు మొదలవ్వక ముందే అంచనాలు పెంచి ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా తినడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటి .

ఈ మూసి ప్రాజెక్టు కూడా ఆ కోవలోకి చెందిందేనా ? గుంపు మేస్త్రి మూసీ ప్రక్షాళన కంటే ముందు నీ నోటిని ప్రక్షాళన చేసుకో.

  ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయకుండా పూటకో మాట మార్చి నోటుకు వచ్చింది ఒర్రకు.

ఇట్లనే ఒర్రుకుంటూ పోతే రంగు పడుద్ది అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేసింది.

వైరల్ వీడియో: బేబీ షవర్ పార్టీలో భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. దెబ్బకు భార్య..?