కోమటిరెడ్డి సవాల్ ను స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మునగాల సబ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

తెలంగాణలో విద్యుత్ వ్యవహారంతో రాజకీయ వేడి రాజుకుంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సవాల్ ను కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వీకరించారు.

ఈ మేరకు ఆయన రాజీనామా లేఖతో మునగాల సబ్ స్టేషన్ వద్ద వేచి చూస్తున్నారని తెలుస్తోంది.

అయితే 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్ వద్దే రాజీనామా చేస్తానంటూ ఎంపీ కోమటిరెడ్డి నిన్న ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ సవాల్ ను ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ స్వీకరించగా.మునగాల సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన తారక్.. మంచి మనస్సంటూ?