కాసేపటిలో జలవిహార్ లో బీఆర్ఎస్ కీలక భేటీ

హైదరాబాద్ లోని జలవిహార్ లో మరికాసేపటిలో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది.ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో ఈ భేటీ నిర్వహించనున్నారు.

నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జ్ లు, వార్ రూం ఇంఛార్జ్ లతో మంత్రులు సమావేశం కానున్నారు.

ఇందులో ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లే అంశంపై మంత్రులు దిశానిర్దేశం చేయనున్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ తనదైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి వల్ల కానిది ప్రశాంత్ నీల్ చేసి చూపిస్తాడా..?