బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ ఒకటే..: బండి సంజయ్

కరీంనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్( BJP Leader Bandi Sanjay ) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బ్రిటీష్ వాళ్లకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.గతంలో కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS,,Congress ) ఎప్పుడూ ఒకటేనని ఆరోపించారు.

కేసీఆర్ ను పట్టించుకునే స్థితిలో తెలంగాణ సమాజం లేదని బండి సంజయ్ తెలిపారు.

తాము మతం పేరిట రాజకీయాలు చేయడం లేదని పేర్కొన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియదని చెప్పారు.

ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ వల్ల ఇరకాటంలో పడ్డ ముగ్గురు హీరోలు వీరే !