యూకేలో దొంగతనానికి కుట్ర పన్నిన బ్రిటీష్ సిక్కు తల్లి, కొడుకు జైలు పాలు…

బ్రిటీష్‌కు చెందిన సిక్కు తల్లి, కొడుకు ఒక చెడ్డ నేరం చేసి ఏకంగా నాలుగేళ్ల జైలు శిక్షకు గురయ్యారు.

వారు తమ తోటి సిక్కులకు సహాయం చేయాలడానికి బదులుగా వారిని దారుణంగా మోసం చేసి జైలు పాలయ్యారు.

ఆగ్నేయ ఇంగ్లండ్‌( England )లోని తమ తోటి సిక్కుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించినందుకు ఈ ఎన్నారై తల్లి, కొడుకులకు దాదాపు నాలుగు సంవత్సరాల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది.

"""/" / దాదాపు 8,000 పౌండ్లు (సుమారు రూ.8.

5 లక్షలు) డబ్బును సిక్కు సమాజంలో పెళ్లి కోసం కేటాయిస్తారు.సెప్టెంబరు 15న సౌతాంప్టన్‌లోని క్లోవెల్లీ రోడ్‌లోని ఒక ఇంట్లో కొంతమంది మహిళలు దీనిని లెక్కించారు.

తల్లి కల్వంత్ కౌర్ (41), ఆమె కుమారుడు జంగ్ సింగ్ లంకపాల్ (22) ఇద్దరూ సౌతాంప్టన్‌( Southampton )లోని యూనియన్ రోడ్‌లో నివసించారు.

మహిళలెవరో, డబ్బులు ఉంచిన చిరునామా వారికి తెలుసు.తుపాకీతో ఉన్న వ్యక్తి సహాయంతో డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేశారు.

ఇంట్లోకి చొరబడి తుపాకీతో మహిళలను బెదిరించారు.డబ్బు తీసుకుని రెడ్ హ్యుందాయ్ కారులో పరారయ్యారు.

కారు డబ్బు లెక్కిస్తున్న మహిళల్లో ఒకరికి చెందినది.పోలీసులు అదే రోజు వారిని పట్టుకుని చోరీకి కుట్ర పన్నారని అభియోగాలు మోపారు.

తల్లీకొడుకులు అక్టోబర్‌లో తమ నేరాన్ని అంగీకరించారు.గత వారం, సౌతాంప్టన్ క్రౌన్ కోర్టు వారికి శిక్ష విధించింది.

కౌర్‌కు 15 నెలలు, లంకాపాల్‌కు 30 నెలల జైలు శిక్ష పడింది. """/" / వెస్ట్రన్ ఏరియా క్రైమ్ టీమ్‌కు చెందిన DC జెస్ స్విఫ్ట్ మాట్లాడుతూ.

కౌర్, లంకాపాల్ చాలా క్రూరమైన మైండ్ సెట్ కలిగి ఉన్నారని అన్నారు.వీరు తమకు తెలిసిన, నమ్మిన వ్యక్తుల నుంచి డబ్బును దొంగిలించారని తెలిసిందన్నారు.

ఆ డబ్బు వారి సంఘంలో మంచి పని కోసం ఉద్దేశించినది అని తెలిపారు.

క్షుణ్ణంగా విచారణ చేయగా తల్లీకొడుకులు నేరాన్ని అంగీకరించారని నిర్ధారించుకున్నామని అన్నారు.వారు ఇప్పుడు వారి చర్యలకు పరిణామాలను ఎదుర్కొంటారు.