బ్రేకింగ్: కర్నూలు జిల్లాలో పరువు హత్య..?
TeluguStop.com

కర్నూలు జిల్లాలో జరిగిన యువకుని దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది.రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆమోస్ అనే యువకుడి మృతదేహాం ఇవాళ లభ్యమైంది.


షరీన్ నగర్ లో ఆమోస్ మృతదేహాన్ని పూర్తిగా కాలిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు.


కాగా మృతుడు ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో ఆమోస్ హత్యను పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు.
ఆమోస్ ను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గుర్తించారు.దీంతో పరువు హత్య కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆ స్టార్ హీరోకు ఊరమాస్ ఎలివేషన్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య.. అంత అభిమానమా?