బ్రేకింగ్: ఏపీలో బీజేపీ నేతల వరుస అరెస్టులు..!! 

ఏపీ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడం సంచలనానికి దారి తీస్తోంది.

ఆలయాల విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తల పాత్ర కూడా ఉంది అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటన చేయడం తెలిసిందే.

దీంతో డిజిపి చేసిన ప్రకటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహించారు.

వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ఒత్తిడితోనే డిజిపి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అంతేకాకుండా బీజేపీ పార్టీ పై డీజీపీ చేసిన వ్యాఖ్యలకు 20 తారీకు లోపు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టారు.

ఈ క్రమంలో పోలీస్ శాఖ నుండి ఎటువంటి వివరణ లేకపోవడంతో ఏపీకి చెందిన బీజేపీ కీలక నేతలు డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనలు చేయాలని రెడీ అవటంతో ఆ సమాచారం పోలీసులకు చేరటంతో వెంటనే అలర్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు.

ఈ పరిణామంతో 200 మంది బీజేపీ కార్యకర్తలు ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు..!