సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి బ్రేక్..!!

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పై( Sircilla Municipal Chairman ) అవిశ్వాస తీర్మానానికి బ్రేక్ పడింది.

బీఆర్ఎస్( BRS ) పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశపెడతారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) రంగంలోకి దిగారని తెలుస్తోంది.

అవిశ్వాసం పెట్టాలనుకున్న వర్గం నిర్వహించిన క్యాంపుకు వెళ్లిన 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరిగి వచ్చారు.

"""/" / ఈ క్రమంలోనే కేటీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు( BRS Councillors ) హాజరయ్యారు.

అయితే దీనిపై అవిశ్వాసం ఏం లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని బీఆర్ఎస్ పట్టణ నాయకుడు చక్రపాణి( Chakrapani ) తెలిపారు.

కాగా సిరిసిల్లలో మొత్తం 39 మంది కౌన్సిలర్లు ఉన్నారు.వీరిలో బీఆర్ఎస్ పార్టీకి 34 మంది, బీజేపీకి ముగ్గురు మరియు కాంగ్రెస్ కు ఇద్దరు కౌన్సిలర్లు ఉన్న సంగతి తెలిసిందే.

బాబాయ్ కి కోపం వస్తే అలా పిలుస్తారు…ఆ గిఫ్ట్ అలానే ఉంది: నిహారిక