ఏపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాతే అఖండ 2…. సీక్వెల్ విషయంపై క్లారిటీ ఇచ్చిన బోయపాటి?

నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను( Balakrishna , Boyapati Srinu ) కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా అఖండ సినిమా ( Akhanda Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.కరోనా సమయంలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ కాబట్టి రికార్డు సృష్టించింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉండబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

"""/" / ఈ క్రమంలోనే తాజాగా బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) మరొకసారి అఖండ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం స్కంద.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకుని.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బోయపాటి వరుస ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా బోయపాటి అఖండ సినిమా ( Akhanda Movie )సీక్వెల్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / బాలయ్య బాబుతో తప్పకుండా ఆఖండ సీక్వెల్ సినిమా( Akhanda Sequel Movie ) ఉంటుందని తెలిపారు.

అయితే ఆయనకు ప్రస్తుతం వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి.నాకు కూడా వేరే హీరోలతో సినిమాలు ఉన్నాయి.

ఈ సినిమా తప్పకుండా వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుందని బోయపాటి తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి.త్వరలోనే బాలయ్య ఎన్నికల నేపథ్యంలో బిజీ కానున్నారు.

అందుకే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తరువాతనే ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించి పనులు మొదలు పెడతాము అంటూ బోయపాటి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం బాలకృష్ణ సినిమా చేయబోతున్నారు.

ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాదా… సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య