రేపు బీజేపీలోకి బూర నరసయ్య గౌడ్

మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ రేపు బీజేపీలో చేరనున్నారు.ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ఇప్పటికే పలువురు బీజేపీ నేతలతో బూర నరసయ్య గౌడ్ సమావేశం అయ్యారు.తాజాగా తరుణ్ చుగ్ ను కలిశారు.

రేపు ఢిల్లీలో ముఖ్య నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.అదేవిధంగా ఆయనతో పాటు టీఆర్ఎస్ కు చెందిన మరో ఇద్దరు నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

అయితే ఆ ఇద్దరు నేతలు ఎవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వీడియో: కదులుతున్న ట్రక్కు వెనుక డేంజరస్ స్టంట్ చేసిన యువకులు.. చివరికి..?