వాఘా సరిహద్దుల్లో అజిత్.. ఫోటోలు షేర్ చేసిన భోని కపూర్?

తమిళంతో పాటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ఒకరు.

ఈయనకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.అజిత్ సినిమా వస్తోందంటే చాలు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు.

అంతగా అజిత్ ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అజిత్ కి వ్యక్తిగతంగా బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం అన్న సంగతి ఎన్నోసార్లు బయటపెట్టారు.

ఈ క్రమంలోనే అతనికి ఏమాత్రం షూటింగ్ సమయంలో విరామం దొరికిన వెంటనే తన బైక్ పై విహార యాత్రలు చేస్తుంటారు.

ఇకపోతే ప్రస్తుతం అజిత్ బోనికపూర్ నిర్మాణంలో హెచ్ వినోద్‌ దర్శకత్వంలో నటిస్తున్న టువంటి చిత్రం ‘వాలిమై’.

ఈ సినిమాలోని ఓ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్రబృందం రష్యా వెళ్లిన సమయంలో కూడా అజిత్ ఇలా బైక్ రైడింగ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

తాజాగా షూటింగ్ విరామ సమయంలో అజిత్ తన బండిపై వాఘా సరిహద్దు ప్రాంతాలను సందర్శించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వాఘా సరిహద్దు దగ్గరకు వెళ్లి మువ్వెన్నల జెండాను పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.

అలాగే అక్కడ సైనికులతో కలిసి ఫోటోలు దిగారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను నిర్మాత బోనీకపూర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

తెలంగాణలో పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు..!